తాజ్ మహల్ (ఉత్తరప్రదేశ్)
తాజ్ మహల్ మీదుగా సాగే బెలూన్ రైడ్ 15-20 నిమిషాలు¹ ఉంటుంది. ఇద మొఘల్ అద్భుతం యొక్క దగ్గరి వీక్షణలను అందిస్తుంది.
లోనావాలా (మహారాష్ట్ర)
60 నిమిషాల పాటు సాగే ఈ సుందరమైన బెలూన్ రైడ్ 4000 అడుగుల ఎత్తునుండీ అడవులు, గుహలు మరియు సరస్సుల యొక్క పచ్చదనాన్ని చూడవచ్చు.
గోవా
సముద్ర తీరప్రాంత ప్రకృతి దృశ్యాలు మరియు శక్తివంతమైన పరిసరాల యొక్క 360-డిగ్రీల వీక్షణలను ఆస్వాదించవచ్చు.
జైపూర్ (రాజస్థాన్)
జైపూర్ యొక్క బెలూన్ రైడ్లు ఆకాశం నుండి పింక్ సిటీని చూపిస్తూ, అందమైన అనుభవాన్ని అందిస్తాయి.
హంపి (కర్ణాటక)
హంపి⁵లో బెలూన్ రైడ్ చేస్తూ పురాతన శిధిలాలు, దేవాలయాలు మరియు తుంగభద్ర నదిని అన్వేషించవచ్చు.
ఆగ్రా (ఉత్తరప్రదేశ్)
ఆగ్రాలోని బెలూన్ రైడ్లు ఆగ్రా ఫోర్ట్ మరియు ఫతేపూర్ సిక్రీ వంటి ఇతర చారిత్రక స్థలాలను బహిర్గతం చేస్తాయి.
జైసల్మేర్ (రాజస్థాన్)
థార్ ఎడారి యొక్క గోల్డెన్ శాండ్ మీద రైడ్ చేస్తూ కోటలు, రాజభవనాలను వీక్షించవచ్చు.
రిషికేశ్ (ఉత్తరాఖండ్)
దట్టమైన అడవులు మరియు కొండల గుండా ప్రవహించే నిర్మలమైన గంగా నదిపై గగన విహారం చేస్తూ మానసిక ప్రశాంతతని ఆశ్వాదించవచ్చు.
మనాలి (హిమాచల్ ప్రదేశ్)
మంచుతో కప్పబడిన శిఖరాలు, లోయలు మరియు నదులపై తేలుతూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలని అనుభవించవచ్చు.
డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్)
తేయాకు తోటలు మరియు పొగమంచు కొండల మధ్య, హిమాలయాల యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూస్తూ రైడ్ చేయటం ఓ చక్కని అనుభూతి.