మనుషుల ప్రవేశం నిషేధం

ఈ దీవికి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ వెళ్లలేరు. పొరపాటున వెళ్తే  ప్రాణాపాయం ఖాయం.

ఈ దీవి పేరు ఏంటి? 

ఈ భయంకర దీవిని "నార్త్ సెంటినెల్ ఐలాండ్" అని పిలుస్తారు. ఇది భారత్‌కు చెందిన అండమాన్ సముద్రంలో ఉంది.

బయటి ప్రపంచం తెలియదు 

ఇక్కడ నివసించే తెగలు వేల ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. వారికి ఈ ఆధునిక ప్రపంచం తెలియదు.

బయటి వ్యక్తులకు వ్యతిరేకత

ఈ తెగకి చెందినవారు బయటి వ్యక్తులెవ్వరినీ అంగీకరించరు. వారి దీవికి వచ్చిన వారిపై వెంటనే బాణాలతో దాడి చేసి చంపేస్తారు.

హింసాకర చరిత్ర

ఇప్పటిదాకా ఈ దీవిలోకి వెళ్ళిన చాలామంది చనిపోయారు. 2006లో పొరపాటుగా వెళ్ళిన ఇద్దరు జాలర్లను బాణాలతో కొట్టి  చంపారు.

ప్రభుత్వ నిషేధం

భారత ప్రభుత్వం ఈ దీవిలోకి  ఎవరూ ప్రవేశించకూడదని అధికారికంగా నిషేధించింది. ఇది ఆయా తెగల హక్కులను కాపాడటానికి తీసుకున్న చర్య.

అనామిక తెగ పేరు ఏమిటి?

ఈ తెగను ‘సెంటినెలీస్’ అంటారు. వీరి భాష, సంస్కృతి గురించి ఇప్పటికీ ఎవరికీ, ఏమీ తెలియదు. వీళ్ళు ప్రపంచంలోని చివరి ప్రాచీన తెగలలో ఒకరు.

డాక్యుమెంటరీలు

కొంతమంది దూరంగా డ్రోన్‌లు, నౌకల ద్వారా క్యాప్చర్ చేసి వీరి జీవితాన్ని డాక్యుమెంటరీల్లో చూపించేందుకు ప్రయత్నించారు. కానీ పూర్తి సమాచారం అందుబాటులో లేదు.

ప్రకృతి పరిరక్షణలో భాగం 

ఈ తెగను బయట ప్రపంచం నుంచి వేరుగా ఉంచడం వల్ల ప్రకృతి, మూలజాతుల పరిరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.