Ashta Vakra Katha, Hindu Mythology

Philosophical Significance of Ashta Vakra Katha

పురాణాలలో ఎంతోమంది ఋషుల జీవిత చరిత్రల గురించి విని ఉంటారు.  కానీ, అష్టావక్రుడి గురించి మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే విని ఉంటారు. నిజానికి అష్టావక్రుడు చాలా గొప్ప ఋషి. ఈయన అనేక భౌతిక వైకల్యాలతో జన్మించినప్పటికీ, లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, భగవద్గీతతో సమానమైన అష్టావక్ర గీతని కూడా రచించాడు. ఇంతకీ ఈ అష్టావక్రుడు ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అష్టావక్రగీత అంటే ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అష్టావక్రుడు ఎవరు?

అష్టావక్రుడు ఎవరో తెలుసుకోనేముందు తన పుట్టుకకు దారితీసిన విపరీత పరిస్థితుల గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. 

త్రేతాయుగంలో జనక మహారాజు మిథిలా నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో మిథిలకి సమీపంలో ఉద్ధాలకుడు అనే ముని తన శిష్యులకి వేద వేదాంగాలు  బోధిస్తూ ఉండేవాడు. వారి వేదఘోషతో అరణ్యమంతా పులకించిపోయేది. ఆయన దగ్గర ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు కూడా వేదాభ్యాసం చేస్తూ ఉండేవాడు. ఆయనో గొప్ప విద్యావేత్త, మరియు నిరంతర తపోనిరతుడు. అంతేకాదు, ఏకాగ్రతతో ఏకదీక్షతో ఆరు వేదాంగాలతో కూడిన వేదాధ్యయనం చేసాడు. ఏకపాదుని సంకల్పానికి మెచ్చి ఉద్ధాలకుడు తన కూతురు సుజాతనిచ్చి వివాహం చేస్తాడు. 

సుజాత ఎంతో ఉత్తమురాలు. భర్తకెన్నో సపర్యలు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన దగ్గరికి ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేసేవారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు. కొంతకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె గర్భములో నున్న శిశువు తన తండ్రి చెప్పే వేదాలు నిరంతరం వల్లె వేస్తూ ఉండేవాడు. 

తండ్రి శాపం 

ఏకపాదుడు ఎప్పటిలానే ఓ రోజు వేదం పారాయణం చేస్తుండగా,  ఒక పదాన్ని ఎనిమిదిసార్లు తప్పుగా ఉచ్చరించారు. అయితే, ఈ వేదాలను వింటోన్న గర్భంలో ఉన్న శిశువు… ‘మీరు తప్పుగా ఉచ్ఛరిస్తున్నారు’ అని తన తండ్రితో పలికాడు. 

గర్భంలోని శిశువు తన లోపాన్ని ఎత్తిచూపడంతో ఆగ్రహించిన ఏకపాదుడు ‘నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు అష్ట వంకర్లతో జన్మిస్తావు’ అని శపించాడు. అలా తండ్రి శాపం కారణంగా ఆ శిశువు 8 వంకర్లతో జన్మించాడు. 

అయితే,  నిద్రాహారాలు లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని చెప్పటమే కాకుండా, తన వేదోచ్చరణనే తప్పు తప్పుపట్టినాడు కావటం చేత తనకు పుట్టబోయే బిడ్డ దివ్యమహిమలు కలవాడని గ్రహించి ఏకపాదుడు ఎంతగానో సంతోషించాడు. కానీ, తననే తప్పు పట్టాడు కాబట్టి కోపం తట్టుకోలేకపోయాడు. అందుకే శపిస్తాడు. 

తండ్రికి శిక్ష

ఒకరోజు సుజాత తన భర్త అయిన ఏకపాదునితో వంటకి కావలసిన సరుకులు తెమ్మని చెప్తుంది. కానీ, ఆ సమయంలో అతని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాడు. వాటికోసం బయలుదేరి వెళుతూ ఉండగా… ఒక ఆలోచన తడుతుంది. అది ఏంటంటే… రాజు ఆస్థానంలో పండిత సభలో వాగ్వివాదానికి దిగటం. 

వాస్తవానికి జనకుడు ఎంతో గొప్ప వ్యక్తిత్వం గలవాడు. పేరుకి మహారాజైనా అతడొక వైరాగ్య కామకుడు. ఆత్మజ్ఞ్యానాన్ని  పొందాలనే తపనతో ఉండేవాడు. ఈ విషయంలో అతని ఆకాంక్ష ఎలాంటిదంటే…  ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞ్యానులందరినీ వెతికి మరీ తన సభలో కొలువుతీరేలా చేశాడు. వారందరినీ అతిధి మర్యాదలతో సత్కరించి, వారి  బాగోగులు చూస్తూ, వారిని సభలో ఆధ్యాత్మికతని  బోధించమనేవాడు.

రోజులో ఎక్కువ సమయం వారు చేసే ఆధ్యాత్మిక బోధనలు వింటూ కాలం గడిపేవాడు. మద్య మద్యలో వారితో సంవాదం చేస్తూ… చర్చలు జరుపుతూ… జ్ఞ్యానోదయానికి మార్గాలు అన్వేషించేవాడు.  ఇలా ఆధ్యాత్మిక గ్రంధాలను అవపోశన పట్టిన పండితులతో రోజులు, వారాలు, నెలల తరబడి వారి వాద, ప్రతివాదాలు వింటూ ఆనందించేవాడు. 

ఇక ఈ వాదాలు ముగిసిన తరువాత గెలిచిన పండితుడిని బహుమతులతోను, సంపదతోను సత్కరించి అతడికి  తన సభలో ఒక ఉచిత స్థానం, లేదా పదవి కల్పించేవాడు. అలా ఎంత మందిని తన సభలో చేర్చుకున్నా కూడా ఎవ్వరూ తన జ్ఞ్యాన దాహాన్ని తీర్చలేకపోయారు. 

ఇదే క్రమంలో మళ్ళీ జనక మహారాజు సభలో పండిత సంవాదం జరుగుతూ ఉంటుంది. ఆ వాదంలో వరుణుని కుమారుడైన వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వము ఇస్తానని, ఓడినవారు జలంలో నిమర్జనం అయి ఉండాలని నియమం ఉంటుంది. అది విని, ఎలాగైనా ఆ వాదంలో గెలవాలని నిర్ణయించుకుంటాడు ఏకపాదుడు. 

అనుకున్న ప్రకారమే వందితో వాదానికి దిగుతాడు. కానీ, అతనితో తలపడి గెలవలేక ఓడిపోతాడు. నియమం ప్రకారం జలంలో నిమర్జనం అయి వుండిపోతాడు. 

ఇదికూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top