Koorma avatharam, Lord Vishnu, Hindu mythology

Spiritual Significance of Koorma Avatharam in Hinduism

జీవాన్ని సృష్టించేది బ్రహ్మ అయితే, సృష్టించిన ఆ జీవాన్ని రక్షించేది విష్ణువు, ఇక ఆ జీవాన్ని శిక్షించేది శివుడు. ఇలా త్రిమూర్తులైన ఈ ముగ్గురూ సృష్టిని ఆది నుండి అంతం వరకూ నడిపిస్తుంటారు. సృష్టిని నడుస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు సృష్టిని కాపాడే బాధ్యత కూడా ఆ మహావిష్ణువు తీసుకున్నాడు. ఈ క్రమంలో సృష్టిని కాపాడటానికి ఒక్కోసారి అవతారపురుషుడిగా వచ్చి ధర్మాన్ని పరిరక్షించాల్సి వస్తుంది. అందులో భాగంగానే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తవలసి వచ్చింది. అందులో రెండవది కూర్మావతారం. ఈ అవతారం గురించి ఈ రోజు  వివరంగా తెలుసుకుందాము.

ఇది కూడా చదవండి: Spiritual Significance of Varaha Avatar in Hinduism

కూర్మావతారం వెనుక ఉన్న కథ

మహావిష్ణువు యొక్క కూర్మావతారం, దానికి  సంబందించి జరిగిన కథను సత్యయుగానికి చెందినదని చెబుతారు. ఈ అవతారం గురించి భాగవత పురాణంలో, అగ్ని పురాణంలో, కూర్మ పురాణం, ఇంకా రామాయణంలో కూడా చెప్పారు. దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు, అమృతం దేవతలకు అందేలా చెయ్యటం కోసం శ్రీమహావిష్ణువు ఈ అవతారం ఎత్తాడని చెబుతారు.  

కూర్మ పురాణం ప్రకారం, స్వర్గాధిపతి ఆయిన ఇంద్రుడి నిర్లక్ష్యం కారణంగా శ్రీమహావిష్ణువు ఈ అవతారం ఎత్తాడని కథ. ఒకసారి, దుర్వాస మహాముని ఇంద్రుడికి ఒక పవిత్రమయిన పూలదండను  ఇస్తాడు. ఇంద్రుడు ఆ మాలను తన ఐరావతం శిరస్సు మీద ఉంచుతాడు. ఆ ఐరావతం ఆ దండను కింద పడేసి కాలితో తొక్కి నాశనం చేస్తుంది. 

ఇది తెలుసుకున్న దుర్వాస మహాముని ఆగ్రహించి దేవతలు అందరూ తమ శక్తిని కోల్పోతారని శపిస్తాడు. ఆ శాపం వలన దేవతలు తమ శక్తి కోల్పోయి క్షీణిస్తారు. ఆ సమయంలో రాక్షసులు దేవతలను సులువుగా ఓడించి పారిపోయేలాగా చేస్తారు. దేవతలకు ఏమి చేయాలో తెలియక వెంటనే శ్రీమహావిష్ణువుని వేడుకుంటారు. 

అప్పుడు మహావిష్ణువు దేవతలను సమాధానపరిచి, పాలకడలిలో పవిత్ర మూలికలను వేసి పూజించి, ఆ తరువాత మందర పర్వతాన్ని కవ్వం లాగా, వాసుకి పాముని తాడులాగా ఉపయోగించి పాల సముద్రాన్ని అమృతం కోసం చిలకమని సలహా ఇస్తాడు. అయితే శక్తి కోల్పోయి క్షీణించిన దేవతల బలం సముద్రాన్ని చిలకడానికి సరిపోదు. ఏమి చెయ్యాలో తెలియక మళ్ళీ మహావిష్ణువును సలహా కోరగా రాక్షసుల సహాయం తీసుకొమ్మని సలహా ఇస్తాడు.

ఆ విధంగా ఒక వైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు వచ్చి మందర పర్వతంతో పాలసముద్రాన్ని చిలకబోతారు. అయితే ఆ మందర పర్వతం సముద్రం అడుగున కూరుకుపోయి చిలకడం సాధ్యపడదు. అప్పుడు శ్రీమహావిష్ణువు అందరికీ అభయమిచ్చి కూర్మావతారంలో సముద్రం అడుగు భాగాన ఉండి మందర పర్వతాన్ని తన మీద ఉంచుకొని చిలకడానికి అనువుగా నిలబెడతాడు.

అప్పుడు దేవతలు వాసుకి తోకను, రాక్షసులు వాసుకి తలను పట్టుకుని చిలకడం ప్రారంభిస్తారు. అలా చిలుకుతుండగా సముద్రపు లోతుల నుండి కల్కుట అనే ఒక భయంకరమైన విషం ఉద్భవిస్తుంది. అందరూ భయపడిపోయి శివుడిని ప్రార్థిస్తే శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచుకుంటాడు. ఈ విషం గొంతులో ఉండటం వల్లనే శివుని కంఠం నీలిరంగులోకి మారి అతను నీలకంఠుడిగా పేరు పొందాడు. 

ఆ తరువాత వరుణి దేవత, సుర దేవత. అందమైన పారిజాత చెట్టు, కౌస్తుభ రత్నం, కపిల ఆవు, ఉచ్చైశ్రవ గుర్రం, ఎందరో అప్సరసలు ఉద్భవిస్తారు. చివరగా, ధన్వంతరి తన చేతుల్లో అమృత భాండాన్ని తీసుకొని ఉద్భవిస్తాడు. రాక్షసులు ఆనందంతో ఆ భాండాన్ని తీసుకొని తమ లోకానికి బయలుదేరతారు. 

అప్పుడు శ్రీమహావిష్ణువు వెంటనే ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి రాక్షసులకు కనిపిస్తాడు. రాక్షసులు ఆ మోహిని స్త్రీ అందానికి ముగ్ధులయ్యి అమృతాన్ని అందరికి పంచమని అడుగుతారు. అయితే మహావిష్ణువు రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతం ఇస్తాడు. దీనిని రాక్షసులు తెలుసుకోలేకపోతారు. 

అయితే రాహువు అనే ఒక రాక్షసుడు తెలివిగా ఈ మోసాన్ని గ్రహించి చంద్రుని రూపంలో దేవతల మధ్యలోకి వచ్చి అమృతం కొంత తాగుతాడు. అయితే అక్కడే ఉన్న సూర్యుడు ఇంకా చంద్రుడు ఈ విషయాన్ని మహావిష్ణువుకు తెలియపరుస్తారు. వెంటనే శ్రీమహావిష్ణువు కత్తితో రాహువు తల నరికేస్తాడు. అయితే కొంత అమృతం తీసుకోవటం వలన అతను చనిపోడు. అతను వెంటనే విష్ణువును ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణువు అతనికి అప్పుడప్పుడు సూర్యుడిని, చంద్రుడిని మింగటానికి అనుమతి ఇస్తాడు. ఇదే మనకు తెలిసిన సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం. 

ఈ విధంగా దేవతలకు అమృతం పంచి వారి శక్తి పెరిగే లాగా చేస్తాడు. పూర్తిగా శక్తిమంతులయిన దేవతలు వెంటనే రాక్షసులతో యుద్ధం చేసి వారిని  ఓడించి తిరిగి స్వర్గం మీద ఆధిపత్యం సంపాదిస్తారు.

ఈ విధంగా మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చి దేవతలకు సహాయం చేసి వారి చేతులలో రాక్షసులు ఓడిపోయేలాగా చేసి లోక కల్యాణం జరిపిస్తాడు. 

అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక అనుమానం వచ్చి ఉండాలి. మహావిష్ణువు పది అవతారాలలో మోహిని అవతారం ఎందుకు లేదు అనే కదా? దీని గురించి కూడా కొందరు పెద్దలు వివరించారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top