హిందూ మైథాలజీ త్రిమూర్తులని సృష్టి, స్థితి, లయ కారకులుగా చెప్తూ వచ్చింది. అలాంటి త్రిమూర్తులు ముగ్గురూ ఒకేచోట కొలువై ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వరం. ఈ క్షేత్రంలో ఉండే శివలింగం అసాధారణంగా 3 ముఖాలు కలిగి ఉండి… మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాదు, ఈ శివలింగం క్రింద ఉండే మిస్టీరియస్ అండర్ గ్రౌండ్ వాటర్ ఎన్నో అంతుచిక్కని రహశ్యాలని తనలో దాచుకొంది. ఇవేకాక ఇంకా ఎన్నో, మరెన్నో నిగూఢమైన విషయాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. అలాంటి త్రయంబకేశ్వర్ టెంపుల్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.
ఆలయ విశిష్టత
త్రయంబకేశ్వర్ టెంపుల్ త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం, ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హిందూ గాడ్ అయిన శివునికి డెడికేట్ చేయబడింది.
త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అయితే, మిగిలిన జ్యోతిర్లింగాలతో పోలిస్తే, ఈ ఆలయ లింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే, ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని ‘త్రయంబకం’ అంటారు.
వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని చెప్తారు. అలాగే 33 కోట్ల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని నమ్ముతారు. అందుకే, ఈ లింగాన్ని పూజించిన వాళ్ళు ముక్కోటి దేవతలను ఒకేసారి పూజించినట్లుగా భావించి మోక్షాన్ని పొందుతారని చెబుతారు.
త్రయంబకేశ్వరుడు అంటే పరమశివుడు అని అర్ధం. ఇక్కడ ‘త్రయం’ అంటే ముగ్గురు; అలానే ‘అంబక’ అంటే నేత్రమని అర్థం. త్రయంబక అంటే – మూడు నేత్రాలు గల దేవుడు అనే అర్ధం వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని యొక్క మూడు ప్రతిరూపాలు మూడు నేత్రలుగా కలిగిన దేవుడే ఈ త్రయంబకేశ్వరుడు.
ఈ ఆలయం బ్రహ్మగిరి, నీలగిరి మరియు కాలగిరి అనే మూడు కొండల మధ్య ఉంది. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు మరియు బ్రహ్మను సూచించే మూడు లింగాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ బిల్వతీర్థం, విశ్వనంతీర్థం మరియు ముకుందతీర్థం అనే మూడు తీర్థాలు కూడా ఉన్నాయి.
గోదావరి నదికి మూలమైన పవిత్రమైన త్రయంబక తీర్థం పేరు మీదుగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ నదిని తరచుగా ‘దక్షిణ గంగ’ అని పిలుస్తారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన నది. ఈ ప్రదేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు.
గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కనే ఉన్న కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తుంది. ఈ నీటిలో స్నానం చేయడం వలన సర్వ రోగాలు పోతాయని, సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
పురాణ ఇతిహాసం
శివ పురాణం ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు లిద్దరూ సృష్టి యొక్క ఆధిపత్యం విషయంలో గొడవ పడ్డారు. అదే సమయంలో వాళ్ళని పరీక్షించడానికి, శివుడు అంతులేని ఓ కాంతి స్తంభంగా, జ్యోతిర్లింగంగా మూడు లోకాలను చీల్చుకొని వెళ్ళాడు. బ్రహ్మ,విష్ణువులు తమ డామినేషన్ ని ప్రూవ్ చేసుకోటానికి ఆ కాంతికి ఎండింగ్ ఎక్కడో కనుగొనాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం బ్రహ్మ హంస రూపాన్ని ధరించి, స్తంభం పై భాగాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఇక విష్ణువు వరాహ రూపాన్ని ధరించి స్తంభం క్రింది భాగాన్ని వెతకడానికి వెళ్ళారు. బ్రహ్మ సగం వరకూ వెళ్లి తిరిగి వచ్చి, ఎండింగ్ ని కనుగొన్నట్లు అబద్ధం చెప్పాడు. కానీ, విష్ణువు మాత్రం తన ఓటమిని అంగీకరించాడు.
అప్పుడు శివుడు ఆ పిల్లర్ పై లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. ఈ సృష్టి ఉన్ననతకాలం విష్ణువు పూజించ బడతాడని వరమిస్తాడు. అలాగే, అబద్దం చెప్పినందుకు బ్రహ్మ మాత్రం ఎవరి చేతా పూజించ బడడని శపిస్తాడు. వెంటనే ఆగ్రహించిన బ్రహ్మ… లింగ రూపంలో ఈ భూమిపైకి నెట్టబడతావని మరియు సహ్యాద్రి పర్వతం వద్ద ఆ రూపంలో ఉండవలసి ఉంటుందని శివుడికి ప్రతిశాపం ఇచ్చాడు. ఈ విధంగా లింగ రూపంలో సహ్యాద్రి శ్రేణుల వద్ద ఉద్భవించి, త్రయంబకాన్ని తన నివాసంగా చేసుకున్నాడు శివుడు.
జ్యోతిర్లింగం అనేది పార్షియల్ రియాలిటీ. శివుడు అందులో పాక్షికంగా కనిపిస్తాడు. ఆ విధంగా శివుడు మండుతున్న కాంతి స్తంభంగా ఈ జ్యోతిర్లింగంలో కనిపిస్తాడు. వాస్తవానికి 64 జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ. వాటిలో 12 మాత్రమే అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి.
ఇది కూడా చదవండి: Mysterious Powers of Meenakshi Temple
స్థల పురాణం
సత్య యుగంలో ఈ ప్రదేశమంతా మునులు, సాధువులు వంటి వారికి నివాస ప్రాంతంగా ఉండేది. సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే నివసిస్తుండేవారు. వీరి ఆశ్రమంలో ఎంతో మంది ఋషులు ఆశ్రయం పొంది ఉండేవారు.