సాదారణంగా ఎక్కడో పిడుగు పడితేనే… ఇక్కడ మన గుండెల్లో గునపాలు దిగినట్లు అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా మనపై పడితే… ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ ఆలోచన వింటేనే చాలా భయమేస్తుంది కదూ! సరిగ్గా ఇదే జరిగింది ఒక వ్యక్తికి. కాకపోతే, ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇండోనేషియాలోని జకార్తాలోని ఓ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో తడుస్తూనే చేతిలో గొడుగు పట్టుకుని ఓ ఓపెన్ ప్లేస్ లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక మెరుపు అతనిని తాకింది. ఆ తర్వాత నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఆ మనిషి నేలకూలాడు.
నిజానికి అతనో మిషినరీ కంపెనీ గార్డ్ గా పని చేస్తున్నాడు. అతని వయస్సు 35 సంవత్సరాలు. డ్యూటీలో ఉన్న సమయంలోనే అటు వైపుగా వెళ్ళాల్సి వచ్చింది. అందుకే, గొడుగు సహాయంతో అవతలివైపు ఉన్న భారీ మిషినరీ వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో అతనిపై ఊహించని విధంగా పిడుగు పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన అతని కొలీగ్స్… అతనిని హాస్పటల్ కి తీసుకు వెళతారు.
అదృష్ట వశాత్తూ, అతనికి ప్రాణాపాయం ఏమీ లేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతని చేతులకు మాత్రం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నాడు. అయితే, అతని చేతిలో ఉన్న గార్డ్ వాకీ-టాకీ పిడుగుని ఆకర్షించటం వల్లే ఇలా జరిగినట్లు తేలింది.
Real Life #MinnalMurali Survived From A Thunder Boult How Lucky! pic.twitter.com/2G1mQySMCB
— tiru (@tiru9676) December 27, 2021