Bike Accident at Hyderabad Medical Check Post

చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ఘోరం జరిగిపోయింది (వీడియో)

పొరపాటుగా జరిగిన ఓ చిన్న మిస్టేక్ వల్ల… ఎంతో ఘోరం జరిగిపోయింది. చూస్తుండగానే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తెలంగాణాలో ఈ రోజు చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కంట తడి పెట్టించింది.

ఓల్డ్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్న రాజమల్లి శ్రీనివాస్, మంజుల దంపతులు బుధవారం ఉదయం వారి స్వగ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మనేపల్లి నుంచి ఓల్డ్ బోయిన్ పల్లికి స్కూటర్‌పై వెళ్తున్నారు. సరిగ్గా 11 గంటల 39 నిమిషాలకు మేడ్చల్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే వారి వాహనం అదుపుతప్పి పక్కకి ఒరిగింది. ఒక్కసారిగా ఏర్పడిన ఆ కుదుపుకు స్కూటర్ వెనకాల కూర్చున్న మంజుల వెనక్కి పడిపోవడం, ఆ వెనకాలే వస్తున్న టిప్పర్ ఆమె పైనుంచి వెళ్లడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో, మంజుల అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చూసి… శ్రీనివాస్ తల బాదుకుంటూ రోదించ సాగాడు. ఆ దృశ్యం చూసిన వారందరికీ మది కలిచివేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top