బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆదుకునేందుకు పవన్ ఈ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మరణించిన రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి… వారిని ఓదారుస్తున్నారు. అంతేకాక, ఒక్కో కుటుంబానికి లక్షరూపాయలు ఆర్ధిక సహాయం అందించి… వారికి అండగా నిలుస్తున్నారు. ఇంకా ఏ కష్టమొచ్చినా… నేనున్నానంటూ భరోసా కూడా ఇస్తున్నారు. 

ఇక రైతు కుటుంబాలని ఆదుకొనేందుకు ‘రైతు భరోసా’ పేరుతో ఒక ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు. ఆ నిధికి తమవంతు సాయంగా విరాళాలు అందిస్తూ… రైతు కుటుంబాలకి అండగా నిలిచేందుకు…ఇటీవలే  మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చింది. అందులో భాగంగా, వరుణ్‌ తేజ్‌ 10 లక్షలు,  నిహారిక రూ.5 లక్షలు, సాయిధరమ్‌ తేజ్‌ రూ.10 లక్షలు, వైష్ణవ్‌ తేజ్‌ రూ.5 లక్షలు, మరోకరు 5 లక్షలు ఇలా మొత్తం రూ.35 లక్షల రూపాయలు అందించి తమ ఉదారత చాటుకున్నారు. వారందరినీ పేరుపేరునా పవన్ అభినందించారు.

ఇదిలా ఉంటే, మెగా డాటర్ నిహారిక తాజాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు స్పందించారు. ముందుగా,  ‘థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయి’ ప్రజలు విశ్వాసంతో కూడిన భవిష్యత్తును నిర్మించుకొనేందుకు తామూ ఓ భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ఎదురు చూసే అసలైన నాయకుడివి నీవే. ప్రజలకు మంచి రోజులు తీసుకురావడం నీ వల్లనే సాధ్యమవుతుంది అంటూ ట్వీట్ చేసింది.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top