ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. ఎటు చూసినా ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’గా… రష్మిక మందన ‘శ్రీవల్లి’గా నటిస్తున్నారు.
స్టోరీ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ సాగుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యాజిక్ కంపోజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ రిలీజైన సాంగ్స్ మొత్తం యూట్యూట్ ని షేక్ చేశాయి.
తాజాగా ‘రారాసామి’ అనే సాంగ్ కూడా ఇప్పుడు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి సంబంధించిన స్ఫూప్లు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఆ పార్టీలో ఇప్పుడు రష్మిక కూడా వచ్చి చేరింది. ఆన్స్ర్కీన్లో ఈ పాటకి స్టెప్పులేసిన రష్మిక… ఆఫ్స్ర్కీన్లో కూడా స్టెప్పులేసింది. అంతేకాదు, ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
వీడియోతో పాటు ఇలా రాసుకుంటూ వచ్చింది. ఈ సాంగ్ కి చాలామంది స్టెప్పులేయడం నేను గమనించాను. అందుకే నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. అందులో భాగంగా నేనీ స్టెప్ వేసి పార్టీలో చేరుతున్నాను. అని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
View this post on Instagram