ఒక సాదారణ వ్యక్తిగా పుట్టి, అసాదారణ శక్తులను సాధించి, పరిపూర్ణ మానవుడిగా మారిన ఒక సిద్ధయోగి ఈ ప్రపంచానికే మిస్టరీగా మారాడు. హిమాలయాల్లో కొన్ని వందల ఏళ్లుగా జీవిస్తూ, ఇప్పటికీ యువకుడిలాగే కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడు పుట్టారు? అసలు నిజంగా మనిషేనా..? లేక దేవుని అంశా..? ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ టాపిక్స్ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వెల్లిపోదాం పదండి.
ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరు?
ఈ రోజు మనం మాట్లాడుకొనే టాపిక్ మహావతార్ బాబాజీ గురించి. రజనీకాంత్ బాబా సినిమా చూసినవాళ్ళందరికీ మహావతార్ బాబాజీ గురించి తెలిసే ఉంటుంది. కానీ, నిజానికి చాలామందికి ఈ బాబాజీ ఎవరో తెలియదు. ఇంతకీ బాబాజీ ఎవరు? ఎప్పుడు పుట్టారు? బాబాజీ ఇప్పటికీ జీవించే ఉన్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎంతో కాలంగా చాలామందిని వేధిస్తూనే ఉన్నాయి.
మహావతార్ బాబాజీ ఎవరు?
బాబాజీ అసలు పేరు కానీ, ఆయన పుట్టిన తేదీ కానీ, ఊరు కానీ, అసలు ఆయన ఎవరు అనేది కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. కానీ, ఆయనను కలిసిన వారంతా పిలుచుకొనే పేరు మాత్రం బాబాజీ. ఒకానొక సమయంలో తనని కలిసిన లాహిరీ మహాశయులు అనేవారికి మాత్రం బాబాజీ తనను గురించి కొన్ని వివరాలను తెలిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ పరమహంస యోగానంద రచించిన “ఆటోబయోగ్రఫీ అఫ్ యోగి’ అనే బుక్ ద్వారా ప్రజల దృష్టికి వచ్చాయి.
మహావతార్ బాబాజీ పుట్టుక
బాబాజీ నవంబర్ 30, 203లో జన్మించారని కొందరంటే… క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో జన్మించారని మరికొందరు అంటారు. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కావేరీనది తీరాన గల పరంగిపత్తై అనే కుగ్రామంలో బాబాజీ జన్మించారు. బాబాజీ అసలు పేరు నాగరాజు. ఈయన నంబూద్రి బ్రాహ్మణ వంశానికి చెందిన శివభక్తులైన వేదాంత అయ్యర్, మరియు జ్ఞానాంబ దంపతులకు పుట్టారు. తండ్రి వేదాంత అయ్యర్ ఆ గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్య ఆలయంలో పూజారిగా ఉండేవారు. ఈ పరంగిపత్తై గ్రామం చిదంబర క్షేత్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మహావతార్ బాబాజీ బాల్యం
బాబాజీ బాల్యం నుండే దగ్గరలో ఉన్న మణిగురుకులానికి వెళ్ళేవారు. అక్కడి అర్చకులు సుబ్రహ్మణ్య కీర్తనలు పాడడం వినీ వినీ బాబాజీకి కూడా ఆయనపై మనసులో విపరీతమైన భక్తిభావం పెంపొందింది. ఇక తండ్రితో పాటు చిదంబరంలో జరిగే పుణ్యకార్యక్రమాలు అన్నిటిలోనూ పాల్గోనేవాడు.
ఇది కూడా చదవండి: Philosophical Significance of Ashta Vakra Katha
మహావతార్ బాబాజీ జీవితం గురించి ఆశ్చర్యకరమైన నిజాలు
బాబాజీ జీవితంలో జరిగిన ఈ 2 ముఖ్యమైన సంఘటనలు ఆయన మహావతార్ బాబాజీగా మారడానికి కారణం అయ్యాయి. అవేంటంటే –
బాబాజీకి శిక్ష
బాబాజీకి 4 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లి జ్ఞానాంబ ఒక పనిష్మెంట్ ఇచ్చింది. అదేమిటంటే, జరగబోయే ఒక ఉత్సవం కోసం ఆమె ఒక పనసపండుని తెస్తుంది. దానిని ఇంట్లో దాచిపెట్టి పనిమీద బయటకు వెళ్తుంది. కానీ, అది తెలియని బాబాజీ ఆకలికి తట్టుకోలేక ఆపండుని తినేస్తాడు. బయట నుండి వచ్చిన తన తల్లి విషయం తెలుసుకుని కోపంతో… బాబాజీ నోటిని ఒక గుడ్డతో కట్టేసి చీకటి గదిలో బంధిస్తుంది.
ఇలా చేయటం వల్ల ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడే శివానుగ్రహంతో బాబాజీకి చాలాసేపు ఊపిరి నిలిపి ఉంచగలిగే ‘కుంభక సిద్ది’ లభించింది. కొంతసేపటి తర్వాత తన బిడ్డ ఊపిరి తీసుకోవడం కష్టమౌతుందని భావించిన తన తల్లి ఆయన నోటికి కట్టిన గుడ్డని తొలగించింది.
ఆక్షణంలో బాబాజీకి తన తల్లిపై ఎలాంటి కోపం రాలేదు కానీ, ఈప్రపంచంలో ప్రేమకు మూలం తల్లి అని తెలుసుకుంటాడు. అప్పటినుండీ బంధాలకు అతీతమైన ప్రేమను గుర్తించి, చిన్మయత్వం వైపు అడుగేశాడు.
బాబాజీ కిడ్నాప్
బాబాజీకి 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఉండే శివాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది జనం అక్కడికి వచ్చారు. వారితో పాటు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా ఒకటి అక్కడకు వచ్చింది.
వాళ్ళు బాబాజీ నోట్లో గుడ్డలు కుక్కి… కిడ్నాప్ చేసి కలకత్తా తీసుకుపోతారు. బాబాజీని అక్కడ ఒక ధనిక బ్రాహ్మణుడికి అమ్మేస్తారు. అయితే, ఈ ధనిక బ్రాహ్మణుడు చాలా మంచివాడు. నిత్యం దైవ నామస్మరణ, భజనలు, కీర్తనలు చేస్తుండేవాడు. క్రమంగా ఇవన్నీ బాబాజీ నేర్చుకుంటూ ఉండేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. యజమాని బాబాజీని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లి హ్యాపీగా బతకు అని పంపించేస్తాడు.
మహావతార్ బాబాజీ సత్యాన్వేషణ
కలకత్తా నుంచీ బయటపడిన బాబాజీ ఒక సన్యాసి బృందంతో కలిసి, ఉత్తర, దక్షిణ భారతదేశ యాత్రలు చేసాడు. కొంతకాలంపాటు రామాయణ, మహభారత ఇతిహాసాలను ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేదాలు ఉపనిషత్తులు నేర్చుకొని… అందులో పరిపూర్ణత కలిగిన కొంతమంది జ్ఞానులతో గడిపాడు. ఆ తరువాత బాబాజీ తన మనసులో ఇలా అనుకున్నాడు. “మాటలు మార్గాన్ని మాత్రమే నిర్దేశిస్తాయి, వాస్తవం ఏమిటో తెలుసుకోవాలంటే… వాటికి అతీతమైన మార్గంలో మనమే వెళ్ళాలి” అని. అందుకే, సత్యాన్వేషణ కోసం ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కొంతమంది యోగులను కలిశాడు.
భోగర్నాథ్ దర్శనం
బాబాజీ 11 సంవత్సరాల వయస్సులో కాశీ నుండి కొంతమంది సాధువులతో కలిసి కాలినడకన భారతదేశం యొక్క దక్షిణ తీరంలో శ్రీలంక ద్వీపానికి దగ్గరగా ఉన్న ధనుష్కోడి అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ నుండి శ్రీలంకకు పడవలో వెళ్లి, ద్వీపానికి ఉత్తరాన ఉన్న పవిత్ర నగరమైన కర్తార్గామాకు కాలినడకన బయలుదేరారు.