అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే! – జనసేనాని

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబి నుండీ బయటపడలేక పోతుంది. అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే పడుతుందని వ్యాఖ్యానించారు.

తాజాగా అయన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,  ‘శ్రీలంకనుంచి తమిళనాడుకి గంట దూరం; అలానే  శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూతవేటు దూరం’ అంటూ ఎమోషన్ అయ్యారు.  ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించటం కాదు, గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు, మీరు చెయ్యవలసిందల్లా చేసిన అప్పులు నుంచి బయటపడే ప్రయత్నం అంటూ చురకలంటించారు.

ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి వైసీపీ నేతలు పనికట్టుకుని మరీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వనవసరం లేదు, తమ తప్పులని ఎత్తి చూపటం కన్నా,  రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఏపీ మరో శ్రీలంకగా మారబోతోంది అంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top