ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల గ్రామాలే కనుమరుగై పోవచ్చు; అలానే కనుమరుగై పోయిన గ్రామాలు బయట పడనూ వచ్చు. సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు.
స్పెయిన్ లోని 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణం చేపడుతుండగా… ఒక విలేజ్ నీటిలో మునిగిపోయింది. అయితే, ఇప్పుడు ఆ ప్రాంతమంతా నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంది. ఈ కారణంగా అక్కడ కరువు తాండవిస్తుంది.
ఎప్పుడైతే అక్కడ డ్యామ్ లో నీరంతా అడుగంటి పోయిందో… అప్పుడు లోపల ఉన్న గ్రామం బయటపడింది. స్పానిష్ లో ఉన్న ‘అసెరెడో’ అనే ఘోస్ట్ విలేజ్ 1992 నుండి డ్యామ్ నీటి అడుగున ఉండిపోయింది. ఇప్పుడు ఆ డ్యామ్ నీళ్ళు తగ్గటంతో… మళ్ళీ ఆ విలేజ్ వెలుగులోకి వచ్చింది.
ఆల్టో లిండోసో రిజర్వాయర్ నిర్మాణం సమయంలో ఆ ప్రాంతమంతా భారీ వరదలు వచ్చాయి. ఆ వరదల్లో అసెరెడో గ్రామం రిజర్వాయర్ అడుగుకి చేరుకుంది. ఇప్పుడు ఆ రిజర్వాయర్ ఎండిపోవటంతో శిథిలాలు బయటపడ్డాయి.
ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ద్రాక్షతోటలు, నారింజ చెట్లతో నిండి ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఘోస్ట్ విలేజ్ లా మారిపోయింది.
🔴 #BreakingNews#Spain: ghost village emerges in Galicia, as drought empties dam!
Flooded since 1992, the Spanish village of #Aceredo “floated” to the surface of the reservoir due to drought. pic.twitter.com/cXKo88QYSS
— 🐝 Marine TRÉBAUL PhD – #SDGs – #Breton – Pigoneer (@BeeAsMarine) February 15, 2022